సీఎం కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన తోబుట్టువులు

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

Update: 2023-08-31 11:01 GMT

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయ‌న‌ అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ అక్క‌లైన లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మలు తమ సోదరునికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. వారి పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ క‌విత కూడా రాక్షబంధ‌న్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. త‌న అన్న‌, మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండ‌గా.. మ‌రో సోద‌రుడు(క‌జిన్‌) రాజ్యసభ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. మ‌రో సోదరి సౌమ్య జోగినిపల్లితో సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లిన కవిత.. అక్క‌డ‌ ఆయ‌న‌కు రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఎంపీ సంతోష్‌ ట్విట్టర్ లో షేర్‌చేశారు.


Tags:    

Similar News