నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రానున్నారు

Update: 2022-07-02 02:22 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హెచ్ఐసీసీకి చేరుకుంటారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా నోవాటెల్ కు చేరుకుంటారు.

షెడ్యూల్ ఇదే...
రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. రేపు సాయంత్రం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఎల్లుండి ఉదయం బేగంపేట్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలుకుతారు.


Tags:    

Similar News