Telangana : రేపు యధాతధంగా నామినేషన్లు?
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలంటూ పిటీషన్ దారులు కోరినప్పటికీ హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి తిరస్కరించింది. బీసీ రిజర్వేషన్ల పై రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో ఎన్నికల కమిషన్ మాత్రం రేపు నోటిఫికేషన్ విడుదల చేయడదానికి సిద్ధమయినట్లు సమాచారం అందుతుంది. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో నామినేషన్లను రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అడ్వొకేట్ జనరల్ అభ్యర్తన మేరకు రేపు విచారణను వాయిదా వేసింది.
షెడ్యూల్ ఇదే...
అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉండనుంది.తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 31 న తొలి విడత పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబరు్ నాలుగో తేదీన, మూడో విడత నవంబరు 8వ తేదీన నిర్వహించనున్నారు. పోలింత్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 12,733 పంచయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.