Telangana : తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల బాదుడు

తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి

Update: 2026-04-01 04:44 GMT

తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైటెన్షన్‌ కరెంట్ కనెక్షన్ తీసుకున్న ఆరు కేటగిరీల ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలపై విద్యుత్తు ఛార్జీల భారం మరింత పడనుంది.

సాయంత్రం నుంచి...
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్తును వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.50 అధికంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పరిశ్రమలతో పాటు కొన్ని వాణిజ్యసంస్థలతో పాటు గృహ సముదాయాలకు కూడా భారీగా విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయి.


Tags:    

Similar News