వాసవి కంపెనీలపై ఐటీ శాఖ దాడులు

వాసవి కంపెనీ, సుమధుర కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి.

Update: 2022-08-18 06:50 GMT

వాసవి కంపెనీ, సుమధుర కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. రెండో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుల్లో ఈ సోదాలను ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలను నడుపుతూ పెద్దయెత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారన్న కారణంపై సోదాలు జరుగుతున్నాయి.

రెండో రోజు...
అయితే ఈ సందర్భంగా పెద్దమొత్తంలో నల్లధనాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి పెద్దమొత్తంలో నల్లధనాన్ని తీసుకున్నారని ఈ సోదాల ద్వారా తేలిందని చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ కంపెనీల వద్ద ఉన్న సేల్ అగ్రిమెంట్లను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఈ కంపెనీలో కొందరు ముఖ్యులు పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News