అరవింద పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు అనవసరమని అభిప్రాయపడింది

Update: 2022-11-29 08:20 GMT

బీజేపీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు అనవసరమని అభిప్రాయపడింది. ధర్మపురి అరరింద్ తనను చంపుతానని మీడియా సమావేశంలో చెప్పిన కవితపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

చర్యలు తీసుకోవాలని...
తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా తన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని అరవింద్ పిటీషన్ లో పేర్కొన్నారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అరవింద్ పిటీషన్ లో కోరారు.అయితే ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు అరవింద్ పిటీషన్ ను కొట్టివేసింది.


Tags:    

Similar News