తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి..

Update: 2023-01-26 13:33 GMT

telangana bhavan

తెలంగాణ రాజ్ భవన్ లో నేడు భారత 74వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై.. అనంతరం పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావడం, సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీకి ఎంపిక కావడం తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లను గవర్నర్ ఘనంగా సన్మానించారు. వారి శాలువా కప్పి, మెమెంటో, ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

గవర్నర్ సత్కరించిన వారిలో.. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి వ్యవస్థాపకులు, సివిల్స్ శిక్షకురాలు బాలలత తదితరులున్నారు. తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. వారిని సత్కరించారు. కాగా.. ఇప్పుడు తెలుగు సినిమా.. చరిత్ర సృష్టించేందుకు ఒక్కడుగు దూరంలో ఉంది. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నామినేషన్ పొందగా.. మార్చి రెండో వారంలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.



Tags:    

Similar News