Telangana : మీ ఖాతాల్లో డబ్బులు పడకపోతే ఇలా చేయండి
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే కొందరికి తమ ఖాతాల్లోకి నగదు పడటం లేదని అంటున్నారు. అటువంటి వారు నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొక్క జొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నిన్నటి నుంచి జమ చేస్తుంది. మొక్కజొన్న ను రైతుల నుంచి కొనుగోలు చేసిన ప్రభుత్వం వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించింది.
యాబై ఐదు వేల మందికి...
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 55,904 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. అధికారులు నిన్నటి నుంచే రైతుల ఖతాల్లో నగదు జమ చేయడాన్ని ప్రారంభించారు. మొక్కజొన్న పంటను సేకరించిన ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అవసరమైన 588 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. వెంటనే రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం అదికారులను ఆదేశించింది. దీంతో నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొక్క జొన్న కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే ఈ నగదు చెల్లింపు చేస్తారు.
బ్యాంకుకు వెళ్లి...
తెలంగాణలో మొత్తం 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన 588 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడంతో నగదు జమ ప్రక్రియను అధికారులు వేగంగా జరుపుతున్నారు. చెల్లింపుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అధికారులు నేరుగా జమ చేస్తున్నారు. ఈరోజు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలని అధికారులు తెలిపారు. రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే బ్యాంకు ఖాతా లింక్ అయిన నెంబర్ కు మెసేజ్ వస్తుంది. లేకుంటే బ్యాంకు వద్దకు వెళ్లి అయినా చెక్ చెసుకోవచ్చని తెలిపారు.