టిఆర్ఎస్ ఫ్లెక్సీలపై జరిమానాల మోత.. మంత్రికి రూ.50వేలు ఫైన్

టిఆర్ఎస్ ప్లీన‌రీని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ నేత‌లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశార‌ని..

Update: 2022-04-28 04:24 GMT

హైదరాబాద్ : నిన్న టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. దాంతో భారీ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారులు జరిమానాలు విధించారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో.. వారందరికీ జరిమానాలు విధించారు. జరిమానాలు విధించబడిన వారిలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జీహెచ్ఎంసీ అధికారులు రూ.50 వేలు జరిమానా వేశారు.

టిఆర్ఎస్ ప్లీన‌రీని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ నేత‌లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశార‌ని, వాటిని తొల‌గించాల‌ని మంగ‌ళ‌వార‌మే బీజేపీ నేత‌లు జీహెచ్ఎంసీ అధికారుల‌ను డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం ఈ ఫ్లెక్సీల‌పై సోష‌ల్ మీడియాలో అధికారుల‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లెక్సీల‌పై అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు. భారీ ఫ్లెక్సీలపై జ‌రిమానాలు విధించారు. ఇందులో భాగంగా త‌ల‌సానికి రూ.50 వేలు, మైనంప‌ల్లి రోహిత్‌కు రూ.40 వేలు, దానం నాగేంద‌ర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంక‌టేశ్ కు రూ.10 వేలు, ఇతరులకు 5 లక్షల 50 వేల రూపాయల ఫైన్ వేసింది. ఇప్పటి వరకు 7 లక్షల 70 వేల రూపాయల ఫైన్ వేసినట్లు తెలిపారు



Tags:    

Similar News