వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్ సహా మూడు షాపులు దగ్ధం

మంటల ధాటికి రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమైంది. రెస్టారెంట్ తో పాటు మూడు షాపులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ ముందు..

Update: 2022-05-27 12:12 GMT

వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌరస్తాలోని మను ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమైంది. రెస్టారెంట్ తో పాటు మూడు షాపులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ ముందు క్లాత్ తో చేసిన డెకరేషన్ కు మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. క్రమంగా ఆ మంటలు రెస్టారెంట్ మొత్తానికి వ్యాపించగా.. ఫర్నీచర్, సీలింగ్ అంతా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కాగా.. గురువారం హైదరాబాద్ లో ఇలాంటి అగ్నిప్రమాదమే సంభవించింది. చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ లో ఉన్న రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరగ్గా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.


Tags:    

Similar News