తెలంగాణలో రైజ్ అవుతున్న కరోనా.. ఈరోజు ఎన్ని కేసులంటే?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 3,944 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు

Update: 2022-01-27 14:31 GMT

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 3,944 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,51,099 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,07,498 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్ కేసులు...

ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 39,520 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,081 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,372 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News