తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,606 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు

Update: 2022-01-09 02:14 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,606 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,89,751 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

హైదరాబాద్ లోనే....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,76,132 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 9,861 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,041 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 1,583 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News