సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌.. మెద‌క్‌లో తీవ్ర‌ ఉద్రిక్తత

మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మెదక్‌లో

Update: 2023-08-23 06:03 GMT

మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాక కోసం అధికారులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే.. సీఎం రాక సంద‌ర్భంగా మెదక్ లో తీవ్ర‌ ఉద్రిక్తత నెల‌కొంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి హెచ్చరించారు. సీఎం ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవడానికి బైక్ పై ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్ర‌య‌త్నించాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు.


Tags:    

Similar News