KCR : నేడు నల్లగొండలో కేసీఆర్ సభ

ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండకు రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు

Update: 2024-02-13 01:51 GMT

ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండకు రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో ఈ సభ ఏర్పాటు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. రైతు గర్జన పేరుతో బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తుంది.

ప్రాజెక్టులను అప్పగింతపై...
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగింతతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. దీంతో కేసీఆర్ పార్టీ ఓటమి తర్వాత జరిగే నల్లగొండ సభలో ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సభకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News