బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతా : బాలీవుడ్ నటుడు గగన్

బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతం పలికి బుద్ధ వస్త్రాలతో సత్కరించారు. అనంతరం బుద్ధవనం..

Update: 2023-07-27 15:42 GMT

budhavanam

అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ ది పార్క్ బుద్ధవనంలోని ప్రత్యేకతలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతానని బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ అన్నారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని ఆయన గురువారం సందర్శించారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతం పలికి బుద్ధ వస్త్రాలతో సత్కరించారు. అనంతరం బుద్ధవనం కన్సల్టెంట్,(డా),ఈమని శివానాగిరెడ్డి ,ధ్యాన వనం శ్రీలంక బుద్ధ విగ్రహం గురించి ఆయనకు వివరించారు.

బుల్లితెర, వెండితెర చిత్రాలు షూటింగులు నిర్వహించేందుకు బుద్ధవనం అనువైన ప్రాంతమని గగన్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్నే బాలీవుడ్, టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు వివరిస్తానని తెలిపారు. బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ప్రముఖులు కె. రాజు, కె.సుధన్ రెడ్డి, శ్యాం సుందరరావు పాల్గొన్నారు.


Tags:    

Similar News