మోదీ బస వద్ద భారీ భద్రత

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. జులై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Update: 2022-06-25 02:53 GMT

తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. జులై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. 2వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. మోదీ 2,3 తేదీల్లో హైదరాబాద్ లో బస చేస్తారు. ప్రధాని మోదీ బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోవాటెల్ హోటల్ తో పాటు రాజ్ భవన్ లోనూ మోదీ బస చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీతో పాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ లకు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి కూడా నోవాటెల్ లోనే బస కల్పించనున్నారు.

నేడు సమీక్ష...
మరోవైపు జులై 3వ తేదీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు నేడు రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ నేతలతో సమావేశమై జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాటుపై ఆయన సమీక్షిస్తారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం ఒకరోజు ముందుగా అంటే వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్ రానున్నారు. బీజేపీ అగ్రనేతల రాక సందర్భంగా భారీ స్వాగతం ఏర్పాటు చేసేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్లాన్ చేశారు.


Tags:    

Similar News