విధ్వంసానికి అసలు కారకుడు ఇతడేనట

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి సంబంధించి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2022-06-18 04:58 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి సంబంధించి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రెచ్చగొట్టడం వల్లనే అభ్యర్థులు విధ్వంసానికి దిగారని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరులో సాయి అకాడమీ పేరుతో డిఫెన్స్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలోనూ బ్రాంచ్ లు ఉన్నాయి. అగ్నిపథ్ విషయంలో ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టేవిధంగా ఆయన ప్రసంగించిన వీడియో కూడా బయటపడింది.

ఖమ్మంలో అరెస్ట్....
సాయి అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు గురువారమే హైదరాబాద్ చేరుకున్నారని తెలిసింది. నిన్న సికింద్రాబాద్ లో కొందరి అభ్యర్థులను అరెస్ట్ చేసి వారి మొబైల్స్ ను పోలీసులు పరిశీలించారు. జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడయింది. ఆర్మీ అభ్యర్థులంతా ఒకే సమయంలో చేరుకోవడానికి కూడా సుబ్బారావు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్బారావును ఖమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు నరసరావుపేట తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చి విచారించనున్నారు.


Tags:    

Similar News