డేంజర్.. అయినా ప్రయాణం

అందెవల్లి వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా అందెవల్లి వంతెన ఉందని ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు.

Update: 2022-08-18 03:30 GMT

అందెవల్లి వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా అందెవల్లి వంతెన ఉందని ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. కొమురంభీం జిల్లాలో ఈ వంతెన కీలకం. రాకపోకలను దీనిపై నిషేధించారు. వంతెనపై నుంచి విద్యార్థులు రాకపోకలను కొనసాగిస్తున్నారు. వేరే మార్గం లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచే అందరూ ప్రయాణించాల్సి వస్తుంది.

హెచ్చరిక బోర్డు పెట్టినా...
ఈ వంతెన ప్రమాదకరంగా మారిందని అధికారులు గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులను నియమించకపోవడంతో అదే వంతెన పై నుంచి అనేక మంది ప్రయాణిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఈ వంతెన దాటి అవతలి వైపు ఉన్న బస్సు వద్దకు చేరుకుంటున్నారు. ఈ వంతెనకు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News