విజయనగరం జిల్లాలో దారుణం...ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థునులపై అత్యాచారం జరిగింది.

Update: 2022-01-02 03:50 GMT

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థునులపై అత్యాచారం జరిగింది. పోలీసుల పేరుతో ఇద్దరు విద్యార్థినులపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. కురుపాంలోని జియమ్మ వలస మండలంలో పోలీసుల పేరుతో ఈ దారుణానికి దుండగులు ఒడిగట్టారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం విద్యార్థినులు రావాడ ద్యాం వద్దకు వెళ్లారు. అక్కడ వారిని అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసుల అదుపులో.....
బాధిత విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే అత్యాచారానికి పాల్పడిని ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడితో పాటు ఇంకెవరు ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News