ఢిల్లీలో మహిళపై అత్యాచారం.. నలుగురి అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2022-01-27 14:45 GMT

దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై మహిళ కమిషన్ సీరియస్ అయింది. లోతైన దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ కమిషన్ పోలీసు అధికారులను ఆదేశించింది.

కేజ్రీవాల్ సీరియస్.....
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News