మంటగలిసిన మానవత్వం.. వదినని క్రూరంగా చావగొట్టిన మరదళ్లు

Update: 2022-09-06 14:29 GMT

మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన ఇది. ఆస్తిలో వాటా అడిగారని వదినను కిందపడేసి కట్టెలతో అత్యంత క్రూరంగా చావబాదేశారు మరదళ్లు. ఆడదే ఆడదానికి శత్రువనే నానుడిని నిజం చేశారు. చావుదెబ్బలు తింటూ ఆమె హాహాకారాలు చేస్తున్నా కనీసం కనికరం లేకుండా పోయింది. జుట్టుపట్టుకుని కిందపడేసి దారుణంగా చితకబాదారు. కనీసం అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రావకపోవడడం గమనార్హం. ఓ యువకుడు ఆపేందుకు ప్రయత్నించినా ఆమె మళ్లీ కర్రతో దాడి చేసింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.

రణస్థలం మండలంలోని పెద్ద పిసిని గ్రామానికి చెందిన రెడ్డి కమలపై ఆమె ఇద్దరు ఆడపడుచులు రెడ్డి జానకి, కొత్తకోట సుశీల చితకబాదారు. ఇటీవల ఉమ్మడి ఆస్తిని సుమారు 40 లక్షల రూపాయలకు విక్రయించినట్లుగా చెబుతున్నారు. అందులో అన్నా వదిన వాటా అడగడంతో వివాదం మొదలైంది. వాటా ఇవ్వడం ఇష్టంలేని అడపడుచులు వదిన కమలను జుట్టుపట్టి కిందపడేసి కర్రలతో అత్యంత క్రూరంగా చావబాదారు. బలమైన కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటనను దూరం నుంచి వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News