గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి

గతంలో ఈ విషయంపై ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లాఠీచార్జి కూడా చేయాల్సి..

Update: 2022-11-22 12:22 GMT

forest ranger died

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. విధులు నిర్వర్తిస్తున్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. స్థానికంగా ఉండే గిరిజన జాతి గుత్తికోయలు ఆ మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు.

గతంలో ఈ విషయంపై ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేయగా.. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ..పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.


Tags:    

Similar News