బాలికపై సోదరుల సామూహిక అత్యాచారం

ఆ పరిచయంతో బాలికను తన ఇంట్లో జరిగే ఫంక్షన్ కు ఆహానించాడు. రానంటున్నా బలవంతంగా తీసుకెళ్లి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా..

Update: 2022-03-11 13:03 GMT

జోధ్ పూర్ : బాలికపై ముగ్గురు సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బార్మర్ జిల్లాలో ఒక వ్యక్తి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం అతనికి ఒక బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బాలికను తన ఇంట్లో జరిగే ఫంక్షన్ కు ఆహానించాడు. రానంటున్నా బలవంతంగా తీసుకెళ్లి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక.. ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు.

అతను నెలన్నర రోజులపాటు తనతోపాటు జోధ్ పూర్ లో ఉంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి తెగబడ్డాడు. వీరిద్దరి తర్వాత మరో సోదరుడు కూడా బాలికపై దారుణానికి తెగబడ్డాడు. ఎట్టకేలకు ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. తన సోదరుడికి జరిగిందంతా చెప్పగా.. అతని సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉండగా.. వారికోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News