Breaking : లిఫ్ట్ తెగిపడి ఇద్దరు మృతి

ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైరు తెగి క్రిందకు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు

Update: 2023-03-18 06:46 GMT

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్ లో లిఫ్ట్ వైరు తెగి క్రిందకు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ఎనిమిది మంది కార్మికులున్నారు. మృతులు బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. సామర్థ్యానికి మించి లిఫ్ట్ లోకి ఎక్కడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాధమికంగా తమ విచారణలో గుర్తించారు.

గాయపడటంతో...
విజయవాడ థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరి కొంత మంది గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లిఫ్ట్‌లో ఒక్కసారి ఎనిమిది మంది ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వీటీపీఎస్‌ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News