బాపట్లలో దారుణం.. తల్లిని గొడ్డలితో నరికిన కొడుకు

గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఓ కుటుంబంలో తల్లి, కూతురు, కొడుకు ముగ్గురూ మానసిక వికలాంగులు. కుమారుడు ఎక్కడ..

Update: 2022-10-15 14:11 GMT

bapatla crime news

ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో మతిస్థిమితం లేని తల్లి వెంకటరత్నం (52)పై మానసిక వికలాంగుడైన కొడుకు లక్ష్మయ్య (25) గొడ్డలితో దాడిచేశాడు. ఆమె గొంతుపై బలమైన గాయం అవడంతో స్పృహ కోల్పోయింది. విషయం గ్రహించిన స్థానికులు, సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటరత్నంను హుటాహుటిన చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఓ కుటుంబంలో తల్లి, కూతురు, కొడుకు ముగ్గురూ మానసిక వికలాంగులు. కుమారుడు ఎక్కడ తప్పిపోతాడోనని భయపడిన తల్లి.. అతను ఎక్కడికెళ్తే అక్కడికి వెనుకాలే వెంబడిస్తూ వెళ్లేది. దీంతో అతని స్నేహితులు మీ అమ్మ ఇలాగే వస్తే.. నీకిక పెళ్లికాదని హేళన చేసేవారు. దాంతో కోపోద్రిక్తుడైన లక్ష్మయ్య.. శనివారం ఇంటికెళ్లి గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం రక్తపు మరకలున్న దుస్తులతో బజారుకి వెళ్లాడు.
లక్ష్మయ్యను చూసిన స్నేహితులు ఏమైందని అడగ్గా.. కోడిని నరికానని అబద్ధం చెప్పాడు. ఈ క్రమంలో.. గుట్కా ప్యాకెట్ ఇస్తే అసలు నిజం చెప్తానంటూ లక్ష్మయ్య వారితో పేర్కొన్నాడు. గుట్కా ప్యాకెట్ ఇచ్చిన తర్వాత లక్ష్మయ్య జరిగిన విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన లక్ష్మయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం అపస్మారక స్ధితిలో ఉన్న వెంకటరత్నంను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.






Tags:    

Similar News