Vikarabad : బ్రేక్ ఫెయిలై లోయలో పడిన బస్సు

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అనంతగిరి కొండల్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Update: 2022-11-20 07:50 GMT

rtc bus accident

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో.. లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అనంతగిరి కొండల్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News