హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ శామీర్ పేట ఓ ఆర్ ఆర్ పై యాక్సిడెంట్ జరిగింది. శనివారం ఉదయం

Update: 2023-10-14 05:44 GMT

హైదరాబాద్ శామీర్ పేట ఓ ఆర్ ఆర్ పై యాక్సిడెంట్ జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆగి ఉన్న లారీని ఓ ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. మృతులు కుత్బుల్లాపూర్ కు చెందిన రాజు, మారుతిలుగా గుర్తింపు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్‌పై వేగంగా వచ్చిన ఇనోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను కుత్బుల్లాపూర్‌కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News