కుంభమేళా నుండి తిరిగొస్తున్న తెలుగువాళ్లు .. ఇంతలో

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ వాసులు

Update: 2025-02-11 06:05 GMT

 Rangampally road accident

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన తెలుగువాళ్లు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైవేపైకి ట్రక్కు రాంగ్‌ సైడ్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు మినీ బస్సులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News