ట్యాంక్‌బండ్‌పై నుండి హుస్సేన్ సాగర్ లో పడిపోయేదే

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా

Update: 2023-07-30 03:40 GMT

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కొద్దిలో హుస్సేన్‌సాగర్‌లో కారు పడిపోయేది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో కారును అక్కడినుంచి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ శివార్లలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. బైక్, కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు కనిపించాయి.


Tags:    

Similar News