ప్రియుడిని కలవడానికి వెళ్లిన ఆమెను కట్టేసి కొట్టారు.. ఎందుకంటే..?

స్థానికులు ఆమెను కర్రలు, రాడ్‌లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా

Update: 2022-08-07 08:18 GMT

ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ప్రియుడిని కలవడానికి వెళ్లిన ప్రియురాలికి గ్రామస్తులు పట్టుకుని కొట్టారు. తాలిబానీ తరహాలో కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. చాలా మంది మహిళలు ఆ మహిళను పట్టుకుని, తాడుతో కట్టేసి కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికులు ఆమెను కర్రలు, రాడ్‌లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా
 మొదలుపెట్టారు. యువతిని కొట్టడం చూసి ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రేమికుడి కోసం గ్రామానికి చెందిన కొందరు వెతుకుతున్నట్లు సమాచారం. ప్రియురాలు మరియు ఆమె ప్రియుడు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వివాహేతర సంబంధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇలా శిక్ష విధించారు. షోహ్రత్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్వాపూర్‌లోని పురానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్‌ వినిపిస్తోంది.


Tags:    

Similar News