ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతం

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతమయింది. వల్లపల్లి తుషార్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది.

Update: 2022-11-17 06:01 GMT

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో విచారణ వేగవంతమయింది. వల్లపల్లి తుషార్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడం కోసం సిట్ ను ఏర్పాటు చేసింది.

తుషార్ కు నోటీసులు....
వల్లపల్లి తుషార్ రామచంద్రభారతి, పైలట్ రోహిత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడటంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నిందితుల ఆడియో, వీడియోల్లోనూ తుషార్ పేరు పదే పదే వినిపించడంతో ఆయనను విచారించాలని సిట్ నిర్ణయించింది.


Tags:    

Similar News