కూకట్ పల్లి బస్సుల దగ్ధం : ప్రమాదం కాదు, అసలు కారణమిది !

కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన భారతీ ట్రావెల్స్ గ్యారేజీలో నిలిపి ఉంచిన 3 బస్సులు ఆదివారం అర్ధరాత్రి..

Update: 2023-02-16 05:40 GMT

kukatpally bus fire case

ఫిబ్రవరి 12న అర్థరాత్రి సమయంలో కూకట్ పల్లిలో ఓ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న భారతీ ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో మంటలు చెలరేగడానికి కారణాలేంటో అప్పుడు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయగా.. తాజాగా బస్సుల దగ్ధం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకొచ్చింది. డ్యూటీకి రాను అని చెప్పిన డ్రైవర్ ను యజమాని చితకబాదినందుకు ప్రతీకార చర్యగా ఈ ఘటన జరిగినట్లు విచారణలో తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన భారతీ ట్రావెల్స్ గ్యారేజీలో నిలిపి ఉంచిన 3 బస్సులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా కాలి బూడిదయ్యాయి. ఈ గ్యారేజీలో నిత్యం 11 బస్సులు పార్క్ చేసి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు (34) రెండు నెలలుగా బస్సుల యజమాని కృష్ణారెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను డ్యూటీకి వెళ్లాలని కృష్ణారెడ్డి ఆదేశించాడు. అయితే తాను ఊరికి వెళ్తున్నానని, డ్యూటీకి రావడం కుదరదన్నాడు వీరబాబు. తన మాటకు ఎదురు చెప్పడంతో ఆగ్రహం చెందిన కృష్ణారెడ్డి.. తన సోదరుడి కుమారుడైన యశ్వంత్‌రెడ్డితో కలిసి వీరబాబును ఓ గదిలో బంధించి బెల్టు, కొబ్బరిమట్టతో విచక్షణారహితంగా కొట్టాడు.
దాంతో వారిపై పగ పెంచుకున్న వీరబాబు అర్థరాత్రి దాటిన తర్వాత గ్యారేజీకి వెళ్లి ఓ బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. అవి క్రమంగా పక్కనున్న రెండు మినీ బస్సులకూ వ్యాపించి, మొత్తం మూడు బస్సులు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడు వీరబాబు ఫిర్యాదుతో బస్సుల యజమాని కృష్ణారెడ్డి, యశ్వంత్‌రెడ్డిపైనా కేసు నమోదైంది.


Tags:    

Similar News