శిల్ప కేసులో మరో కొత్త పేరు.. ఇంతకీ ఎవరు ఆమె ?

శిల్పా చౌదరి కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త పేరు విచారణలో బయటకు వచ్చింది

Update: 2021-12-04 12:31 GMT

అధిక వడ్డీలు వసూలు చేస్తూ.. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆమెను శనివారం కూడా నార్సింగ్ పోలీసులు ప్రశ్నించారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలను టార్గెట్ గా చేసుకుని.. వారితో స్నేహం చేశారు. ఆ తర్వాత భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ రంగం, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే కోట్లలో లాభాలు తెచ్చిపెడతామని నమ్మబలికి వారి వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టారు. పెట్టుబడులు పెట్టినా తిరిగి ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. మొత్తం మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు శిల్పా ను కోర్టు ఆదేశాలతో రెండ్రోజులు కస్టడీలోకి తీసుకుని, విచారణ చేయగా పలు ముఖ్యమైన విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది.

రెండో రోజు...
శనివారం నార్సింగ్ పోలీసులు శిల్పాను తమదైన శైలిలో విచారించారు. పలువురి నుంచి తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ప్రశ్నలు సంధించగా.. మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరే రాధిక. తనవద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించకపోవడంతోనే తాను నష్టపోయినట్లుగా శిల్ప చెప్పినట్లు సమాచారం. శిల్ప చెప్పిన వివరాలతో రాధికను కూడా కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే శిల్ప చెప్పే విషయాల్లో అంతా నిజమే ఉండకపోవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతులు చేసిన మోసంలో పోలీసులకు ఇంకా ఎన్నో తీరని అనుమానాలు, సందేహాలు లేకపోలేదు. కాగా.. శిల్ప కస్టడీ నేటితో ముగియనుండగా.. కొద్దిసేపటిలో ఆమెను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.


Tags:    

Similar News