ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

ఘటనా స్థలానికి చేరుకున్న వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఎస్సై రంగారావు, వేంపల్లి ఎస్సై తిరుపాల్..

Update: 2023-02-13 09:03 GMT

కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటికి చెందిన ఎం.అఖిల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్ రూమ్ లో అఖిల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఎస్సై రంగారావు, వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి పరిస్థితిని పరిశీలించారు. అఖిల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు.. తోటి విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. అఖిల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.




Tags:    

Similar News