మంత్రి, ఎమ్మెల్యేల నగ్న వీడియోలు.. 'ఆమె' స్టేట్ రాజకీయాలనే కుదిపేస్తోంది

Update: 2022-10-10 02:47 GMT

అందంతో ఆమె ఎంతో మందికి వల వేసింది.. చాలా మంది ప్రముఖులను తన ఉచ్చులోకి దింపింది. ఆపై ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు రికార్డు చేసింది. ఇదంతా చేసింది కేవలం డబ్బు కోసమే.. అయితే ఆమె వలలో పడిన వారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన యువతి అర్చన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత తన ఇంటికి రమ్మని పిలిచేది. వారితో సన్నిహితంగా ఉంటూ వాటిని రహస్యంగా తన ఫోన్‌లో చిత్రీకరించేది. ఆపై వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించేది. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించేది. కొందరు పోలీసులు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కూడా ఆమె వలలో చిక్కుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వీడియోలు, ఫొటోల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డ్ తదితర ఖరీదైన కార్లతోపాటు ఓ ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

ఆమెను విచారిస్తున్న పోలీసులు నిందితురాలు బయటపెడుతున్న విషయాలు విని నిర్ఘాంతపోయారు. మంత్రితో ఏకాంతంగా ఉన్న ఫొటోలను చూపించి రూ. 5 కోట్లు, ఎమ్మెల్యేల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె భర్త జోగ బందునాగ్ సహకారం ఉందని, గదిలో రహస్య కెమెరాలు పెట్టడం, ఆ దృశ్యాలను చిత్రీకరించడం వంటివి ఆయనే చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2015లో కలహండి జిల్లాలోని కెసింగ అనే ప్రాంతం నుంచి భువనేశ్వర్ వచ్చి స్థిరపడిన ఆమె కోట్లకు పడగలెత్తింది. దీంతో అనుమానించిన పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆమెకు 64 మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. భువనేశ్వర్‌లోని బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు సంపాదించి వారితో నెమ్మదిగా పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వలలో చిక్కుకున్న నేతల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఆమె వద్ద ఉన్న వీడియోల్లో తమవి కూడా ఉన్నాయని తెలిసి బిజూ జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది.
ఆమె వలలో 64 మంది ప్రముఖులు చిక్కుకున్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పేర్లు వెల్లడించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రుతి పట్నాయక్ డిమాండ్ చేశారు. ఖరీదైన భవనాలు, ఫామ్ హౌస్‌లు, ఖరీదైన గుర్రాలు, విదేశీ జాగిలాలు, అధునాతన కార్లు, ద్విచక్ర వాహనాలు ఎలా వచ్చాయో తేల్చాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News