కారులో డెడ్‌బాడీ కలకలం.. విజయవాడలో నడిరోడ్డుపై..

విజయవాడలో పార్కింగ్ చేసి ఉన్న కారులో మృతదేహం లభ్యమైంది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Update: 2022-05-03 16:37 GMT

విజయవాడలో నడిరోడ్డుపై నిలిపివుంచిన కారులో డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపుతోంది. నగరంలోని పటమటలంక డీమార్ట్ సమీపంలోని వీఎంసీ స్కూల్ వద్ద నిలిపివుంచిన టాటా ఇండికా కారులో మృతదేహం లభ్యమైంది. గత మూడు రోజులుగా కారు ఇక్కడే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులైనా కారులో డెడ్‌బాడీ ఉన్న విషయం తెలియలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కారులో డెడ్‌బాడీ కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? లేక మరేదైనా జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. కారు ముందు సీట్‌లోనే మృతదేహం పడిపోయి ఉంది. కారులో నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికెళ్లిన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News