గుంటూరు: తల్లితో చనువుగా ఉంటున్నాడని.. మర్మాంగం కోసేసిన కూతురు

పరాయి వ్యక్తితో తల్లిని చూసిన కూతురు కోపం పెంచుకుంది. అతన్ని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో బ్లేడుతో దాడి చేసింది.

Update: 2022-05-03 08:19 GMT

others

తన తల్లిని పరాయి వ్యక్తితో చూసి తట్టుకోలేకపోయిన కూతురు దారుణానికి ఒడిగట్టింది. అర్ధరాత్రి వేళ అమానుష చర్యకు పాల్పడింది. అందరూ నిద్రిస్తుండగా వెళ్లి అతని మర్మాంగం కోసేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని తుమ్మలపాలెంకి చెందిన రామచంద్రారెడ్డి తెనాలిలో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు. అతనికి స్థానిక ఐతానగర్‌కి చెందిన మహిళతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ అప్పుడప్పుడూ కలిసి మద్యం తాగి ఎంజాయ్ చేస్తుంటారు.

ఇద్దరి వ్యవహారం ఆమె కూతురికి తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. ఇంటికి రావొద్దంటూ రామచంద్రారెడ్డికి చెప్పింది. అయినా వినిపించుకోని రామచంద్రారెడ్డి నిన్న తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి పడుకున్నారు. అతను డాబాపై నిద్రిస్తుండగా.. మహిళ ఇంట్లో నిద్రించింది. అదే అదనుగా భావించిన ఆమె కూతురు తన ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. రామచంద్రారెడ్డి నిద్రిస్తుండగా బ్లేడుతో అతని మర్మాంగాన్ని కోసేసింది. అతని కేకలు విన్న స్థానికులు స్పందించి వెంటనే తెనాలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. టూటౌన్ సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News