తల్లికి చికెన్ ఇచ్చి రమ్మని ఓ యువకుడికి చెప్పాడు.. ఇంతలో

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 95వ వార్డు పురుషోత్తపురం

Update: 2023-07-31 02:42 GMT

విశాఖపట్నంలో వృద్ధురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్యకు గురయిన వృద్ధురాలు వరలక్ష్మి (73) కుటుంబం నిర్వహిస్తున్న షాప్‌లో గత కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్‌గా వెంకటేష్ పనిచేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేశాడు. సమాచారం తెలియడంతో వెంటనే పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకోని ఆధారాలు సేకరిస్తున్నారు. వృద్ధురాలు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిందుతుడు దోచుకెళ్లాడు. పోస్టుమార్టమ్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్‌ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్నట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రాయవరపు వెంకటేష్ (26) చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. గత రాత్రి షాపు పనులు ముగించుకొని షాప్ యజమాని తన తల్లికి మిగిలిన చికెన్ ఇవ్వమని చెప్పాడు. దాంతో సుజాతనగర్ లో 80 ఫీట్ రోడ్లో శివారులో ఉన్న యజమాని తల్లి ఇంటికి వెళ్లాడు. వెంకటేష్ యజమాని తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలించే ప్రయత్నంలో ఆమెను హత మార్చాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు.


Tags:    

Similar News