ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..కళాశాల ఆవరణలోనే..

ఆమె ప్రియుడు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దాడి అనంతరం బాధిత యువతి, ఆమె ప్రియుడు

Update: 2023-01-14 13:51 GMT

దేశమంతా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయి ఉన్న వేళ.. ఓ యువతిపై ఆమె ప్రియుడి కళ్లముందే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన.. తమిళనాడులోని.. బెంగళూరు - పుదుచ్చేరి హైవే సమీపంలోని తమిళనాడులో ఉన్న కాంచీపురంలో జరిగింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో.. ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో ఓ యువతి.. ఆమె ప్రియుడు కలిసి మాట్లాడుకుంటుండగా.. ఐదుగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. కత్తులతో వాళ్లని బెదిరించారు. ఈ క్రమంలో ప్రియుడిని బంధించిన దుండగులు.. ఒక్కొక్కరుగా యువతిపై దారుణానికి పాల్పడ్డారు.

ప్రియుడిని బంధించి.. అతని కళ్లెదుటే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో యువతి కాపాడాలంటూ కేకలు పెట్టగా.. గొడవ చేస్తే అక్కడికక్కడే చంపి పాతిపెడతామని బెదిరించారు. ఆమె ప్రియుడు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దాడి అనంతరం బాధిత యువతి, ఆమె ప్రియుడి కలిసి బంధువుల ఇంటికెళ్లారు. జరిగింది వారితో చెప్పగా.. యువతిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాలేజీ ఆవరణలో చీకటిగా ఉండడంతో దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించలేకపోయామని పోలీసులకు తెలిపారు. అయితే నిందితుల్లో ఒకరి పేరు విమల్ అని యువతికి తెలిసింది. వారంతా మద్యం మత్తులో మాస్క్‌లు ధరించి ఉన్నారని బాధితురాలు చెప్పింది. అందువల్లే వారి ముఖాలను గుర్తించలేకపోయానని పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు.. విపాడు గ్రామంలో పోలీసులు విమల్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. విపాడు గ్రామంలో పోలీసులు విమల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విమల్ ద్వారా తమిళనాడు పోలీసులు మిగతా నలుగురు నిందితులైన మణికందన్, శివకుమార్, విఘ్నేష్, తెన్నరసులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News