Tirupathi : బదిర విద్యార్థిపై దాడి... పరిస్థితి విషమం

తిరుపతిలో బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది

Update: 2023-11-22 04:19 GMT

తిరుపతిలో బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన చెవిటి, మూగ పాఠశాలలో ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ విద్యార్థికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చందు అనే విద్యార్థికి, తోటి విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ ఈ ఘటనకు దారితీసింది.

విద్యార్థుల మధ్య...
చందుపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పటించారు. దీంతో చందు శరీరం 80 శాతం కాలిపోయింది. మెజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారు. తన చేయిపై రాసి తనపై దాడి చేసిన వారి పేర్లను ఆ విద్యార్థి చెప్పాడు. విద్యార్థి చందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారకులైన వారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడి తరుపున కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News