ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని అక్కాచెల్లెళ్ల బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ముగ్గురు మరణించారని వైద్యులు తెలిపారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లకు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. దానికి బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ముగ్గురినీ మందలించారు.
తొమ్మిదో అంతస్తు పై నుంచి...
దీంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లు 9వ అంతస్తు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కొరియన్ లవ్ గేమ్కు బానిసైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వాటిని చూడాలని తపించేవారు. అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు అక్కా చెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడటం విషాదం చోటు చేసుకుంది. తమని క్షమించమని అంటూ సూసైడ్ నోట్ రాశారు.