హైదరాబాద్ లో మరో దారుణం.. మరో బాలిక గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఐదుగురు యువకుల అత్యాచాారానికి పాల్పడిన వెలుగు చూసింది

Update: 2022-06-07 02:57 GMT

హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఐదుగురు యువకుల అత్యాచాారానికి పాల్పడిన వెలుగు చూసింది. గత రెండు నెలలుగా బాలికపై అత్యాచారానికి యువకులు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని కార్ఖానాలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన యువకులు ఇన్ స్టామ్ గ్రామ్ లో బాలికతో పరిచయం పెంచుకున్నారు. ధీరజ్, రితేష్ లు బాలికతో పరిచయం పెంచుకుని హోటల్ కు రప్పించారు.

రెండు నెలలుగా....
హోటల్ లో తమ స్నేహితులతో కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి మరీ బాలికను బెదిరింపులకు గురి చేశారు. పదే పదే అత్యాచారానిక పాల్పడటంతో బాలిక మనస్తిమితం కోల్పోయింది. తల్లిదండ్రులు సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా అక్కడ బయట పడింది. రెండు నెలలు నుంచి తనపై యువకులు అత్యాచారాలు చేస్తున్నా వీడియోలు బయటపెడతారని ఆ బాలిక భయపడిన విషయం సైక్రియాటిస్ట్ దగ్గర బయటపడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఒక మైనర్ తో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News