మొబైల్ వాడొద్దని మందలించిన తల్లి.. క్షణికావేశంలో కుమార్తె..?

స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడిపోయిన ఓ యువతిని.. తల్లి ఎక్కువగా ఫోన్ వాడొద్దని మందలించింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది

Update: 2021-12-14 06:01 GMT

మొబైల్.. ప్రస్తుతం వయసు, జనరేషన్ తో సంబంధం లేకుండా వాడుతున్న ఆయుధమిది. ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. అంతలా అడిక్ట్ అయిపోయారు స్మార్ట్ ఫోన్లకు. పిల్లలు అన్నం తినడం లేదని ఫోన్ లో బొమ్మలు చూపించి పెట్టడం మొదలు.. ఇక అదే అలవాటుగా మారి, దాన్ని వదిలి ఉండలేనంతగా తయారవుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. ఒకప్పుడు అంటే ఈ స్మార్ట్ ఫోన్లు లేని సమయంలో.. చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేవారు. లేదా తినకపోతే బూచోడు వస్తాడని భయపెట్టి తినిపించేవారు. ఇప్పుడు పిల్లలు అలా కాదు. ఫోన్ ఇస్తావా.. సస్తావా అన్నట్లు తయారయ్యారు. పూర్తిగా ఊహ తెలియకముందు నుంచే స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేసేస్తున్నారు. మంచికి వాడితే పర్లేదు.. కానీ అనవసరమైన కంటెంట్ ను చెవికెక్కించుకుంటున్నారు. అదే మున్ముందు తరాలకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ వాడొద్దంటూ...
స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడిపోయిన ఓ యువతిని.. తల్లి ఎక్కువగా ఫోన్ వాడొద్దని మందలించింది. అంతే క్షణం ఆలోచించకుండా ఆత్మహత్య చేసేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన బూడిగ నరేశ్ - ఉమారాణి దంపతులకు మనీషా (15) అనే కుమార్తె ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ పాఠాలు వినేందుకు ఫోన్ కొన్నారు. అప్పుడంటే.. ఆన్ లైన్ పాఠాల కోసం ఫోన్ వాడింది.
స్కూల్ రీ ఓపెన్ చేశాక కూడా....
స్కూల్స్ రీ ఓపెన్ చేశాక కూడా మనీషా అదే పనిగా ఫోన్ చూసే అలవాటును మానుకోలేదు. అసవరానికి మించి ఫోన్ వాడటం, తరచూ స్నేహితులకు ఫోన్లు చేస్తూ గంటలకొద్దీ ముచ్చట్లు పెట్టడం లాంటివి చేస్తుండటంతో తల్లి ఉమాదేవి మనీషాను హెచ్చరించింది. కొంచెం గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన మనీషా ఇంట్లో ఉన్న కలుపుమందును తాగేసింది. కొద్దిసేపటికి వాంతులు చేసుకోవడంతో.. విషయం గ్రహించిన కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనీషా మృతి చెందింది. తల్లి ఉమారాణి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News