ఘోరప్రమాదం : 5గురు మృతి, 70 మందికి గాయాలు

కడలూర్ నుంచి వేగంగా వెళ్లున్న బస్సు ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పింది. అదే సమయంలో పన్రుతి నుంచి కడలూర్..

Update: 2023-06-19 10:11 GMT

bus accident in tamilnadu

రెండు ప్రైవేటు బస్సులు పరస్పరం ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తమిళనాడులోని కడలూర్ లో సోమవారం జరిగింది. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ రోజు(జూన్19) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

కడలూర్ నుంచి వేగంగా వెళ్లున్న బస్సు ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పింది. అదే సమయంలో పన్రుతి నుంచి కడలూర్ వైపు వస్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు నిర్వహించారు. సీఎం స్టాలిన్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


Tags:    

Similar News