సాయిరెడ్డి ట్వీట్ చూశారా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ లు చేయడంలో ముందుంటారు.

Update: 2022-06-02 04:54 GMT

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ లు చేయడంలో ముందుంటారు. ఈ మధ్య కాలంలో ట్వీట్లలో కొంత పరుష పదజాలం కన్పిస్తున్నా కొన్ని ట్వీట్లు మాత్రం పార్టీ క్యాడర్ తో పాటు వైసీపీ అభిమానులను సయితం ఉత్తేజపరుస్తాయి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా అటువంటిదే. నాక్ అవుట్ పేరుతో విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు పార్టీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


తాజాగా విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై ట్వీట్ చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనను జగన్ వ్యతిరేక మీడియాకు, చంద్రబాబుకు లింకు చేస్తూ ట్వీట్ చేశారు. ఎప్పటిలాగానే తలపుల చాటున.. సోఫాల కింద, కుర్చీల చాటున... నక్కుతూ... నీలుగుతూ అంటూ ట్వీట్ చేశారు. 



Tags:    

Similar News