Supreme Court : జగన్ సర్కార్ కు సుప్రీం ఝలక్

జగన్ సర్కార్‍ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-04-29 07:37 GMT

జగన్ సర్కార్‍ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.⁠ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ⁠ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అక్రమ తవ్వకాలు...
ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలను మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ⁠రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీ లోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ మే 10వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News