విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరవధిక సమ్మె

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు కార్మికులు దిగనున్నారు

Update: 2022-03-21 05:46 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు కార్మికులు దిగనున్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు చర్యలు కూడా ప్రారంభించింది.

ఈ నెల 28 నుంచి....
ప్రయివేటీకరణ ప్రకటన వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రోజు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ వైపు మొండిగా వెళుతుండటంతో నిరవధిక సమ్మెను చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాయి.


Tags:    

Similar News