విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికల సమ్మె వాయిదా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు.

Update: 2022-01-30 02:13 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. నిజానికి రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు కార్మికులు నోటీసులు ఇచ్చారు. వేతన సవరణ ఒప్పందం అమలు కోసం కార్మిక శాఖకు వారు ఈ నోటీసులు ఇచ్చారు. అయితే కార్మిక సంఘాలతో కార్మిక శాఖ చర్చలు జరిపింది. వేతన సవరణ ఒప్పందం విషయంలో కార్మికుల డిమాండ్లను పరిశీలించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

వేతన ఒప్పందం....
దీంతో కార్మికులు కూడా వెనక్కు తగ్గారు. తాము ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఆమోదయోగ్యమైన నిర్ణయం సమావేశంలో వచ్చిందని చెప్పారు. దీంతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కూడా సమ్మెను వాయిదా వేశామని వారు తెలిపారు.


Tags:    

Similar News