నువ్వు మెక్కేసిన వెయ్యి కోట్లు కక్కు ముందు.. సొంత పార్టీ ఎంపీపై విజయసాయి ఫైర్

రెండు నెలల కిందట రాష్ట్రంలో తాను సర్వే చేయించానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందంటూ

Update: 2022-09-01 13:56 GMT

వైసీపీ‌ ఎంపీగా గెలిచి సొంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోమారు ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. విగ్గు రాజా.. పెగ్గు రాజా అంటూ అదిరిపోయే సెటైర్లు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తుందని.. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వార్ వన్‌సైడేనంటూ రఘురామ చెప్పిన సర్వేపై విజయసాయి స్పందించారు. ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని ప్రెస్‌మీట్లు పెట్టి కామెడీ పండించడమే కాకుండా.. సర్వేలతో వినోదం కూడా పంచుతున్నావా విగ్గు రాజా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెట్టు కింద చేరినంత మాత్రాన నువ్వేమైనా గౌతమ బుద్ధుడివి అయిపోతావా ఏంటి? అంటూ సెటైర్లు వేశారు. అసలు నీకే విశ్వసనీయత లేదు.. ఇక నువ్వు సర్వేలు చేయడమేంటంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏం జరిగినా ఓ పెగ్గేసుకుని వచ్చేస్తాడు విగ్గు రాజు. రాష్ట్రం సంగతి పక్కన పెట్టు.. బ్యాంకులకు ఎగ్గొట్టిన వెయ్యి కోట్లు ప్రజల సొమ్ము కక్కు ముందు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనో స్టాండప్ కమెడియన్ అని విజయసాయి అన్నారు.

రెండు నెలల కిందట రాష్ట్రంలో తాను సర్వే చేయించానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందంటూ రఘురామ చెప్పారు. ఈ సర్వేలో 93 సీట్లు టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని.. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో సగం గెలిచినా 127 సీట్లు పక్కాగా వస్తాయని ఆయన తేల్చేశారు. జనసేనతో కలిస్తే వార్ వన్‌సైడేనని రఘురామ అభిప్రాయపడ్డారు. వైసీపీకి పట్టుమని పది స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇంగ్లిష్ చానళ్ల సర్వేలను చూసి వైసీపీ నేతలు మురిసిపోతే మునిగిపోతారంటూ హెచ్చరికలు చేశారు.

https://twitter.com/VSReddy_MP/status/1565210341897904128


Tags:    

Similar News