Godavari : గోదావరి పుష్కరాల పనులు నేటి నుంచి ప్రారంభం

రాజమండ్రిలో నేడు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేయనున్నారు

Update: 2025-06-26 03:13 GMT

రాజమండ్రిలో నేడు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రాజెక్టకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు పవన్ కల్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంద్రేశ్వరి, మంత్రి కందుల దుర్గేశ్ లు హాజరు కానున్నారు. రాజమండ్రి నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 97 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వంభాగస్వామ్యంతో 127 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమండ్రి హేవలాక్ వంతెనతో పాటు పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. రాజమండ్రిలోని పపుష్కరాల రేవును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు.

ఇరవై లక్షల మందికి....
గోదావరి నది మధ్యలో 116.97 ఎకరాల్లో వంతెనలను వినోద కేంద్రంగా మార్చనున్నారు 2027 లో జరిగే పుష్కరాలకు ఇంకా తేదీ ఖరారు కాకపోయినప్పటికీ ఇప్పటి నుంచే పనులు ప్రారంభించనున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలకు దాదాపు ఇరవై లక్షల మందికి పైగా ప్రజలు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నంగా నిర్వహించాలని భావించింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.
ప్రత్యేక ఏర్పాట్లు...
మహిళలకు ప్రత్యేకంగా స్నానఘాట్లను పరిశీలిస్తుంది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రభుత్వం ప్రచారం చేయనుంది. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం దాదాపు 94 కోట్ల రూపాయలతో ప్రతిపాదలు సిద్దం చేసింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే కొంత నిధులను కేటాయించింది. రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 271.43 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే యాత్రికులు బస చేసేందుకు తాత్కాలిక టెంట్లను మహా కుంభమేళా తరహాలో చేయాలని కూడా భావిస్తుంది.


Tags:    

Similar News